కార్తీక మాసం చివరివారం కావడంతో అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

కార్తీక మాసం చివరివారం కావడంతో అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

ముద్ర, మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానం శనివారం భక్తులతో పోటెత్తింది. శుక్రవారం రాత్రికే భక్తులు కొండపైకి చేరుకోగా వేకువజాము నుంచి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. కార్తీక మాసం ముగుస్తుండడం ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరించి పూజలు జరిపారు.