బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి : బోయినపెల్లి వినోద్

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి : బోయినపెల్లి వినోద్

ముద్ర, మల్యాల: కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ కోరారు. చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ మద్దతుగా శుక్రవారం మల్యాల బ్లాక్ చౌరస్తా నుండి అంగడి బజార్ వరకు రోడో నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మూడు గంటల కరెంటు చాలని, ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అదే జరిగితే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తాము మరోసారి అధికారంలోకొస్తే అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామన్నారు. పథకాలు కొనసాగాలన్నా.. మరిన్ని పథకాలు రాష్ట్ర సీఎం కెసిఆర్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణను దేశంలోనే నంబర్ లో నిలిపాయని అన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడెట్లుందో గమనించాలని సూచించారు. కొండగట్టు అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు ఇస్తానని సీఎం ప్రకటించారని, త్వరలోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సుంకే రవిశంకర్ ను  మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, సర్పంచుల పోరం అధ్యక్షులు సుదర్శన్, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సాగర్ రావు, మధుసూధన్ రావు, గణేష్, రాజేందర్, శివ, రమణ తదితరులు పాల్గొన్నారు.