కేసిఆర్ మహోన్నతమైన నాయకుడు - మంత్రి కొప్పుల ఈశ్వర్
![కేసిఆర్ మహోన్నతమైన నాయకుడు - మంత్రి కొప్పుల ఈశ్వర్](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652e4f7361f5e.jpg)
వెల్గటూర్, ముద్ర : ముఖ్యమం త్రి కేసీఆర్ మహోన్నతమైన నాయకుడని, ఆయన పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వెల్గటూర్ మండలంలోని, శాఖాపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంత్తు కానున్నాయని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి, అన్ని రంగాలలో ప్రగతి పథాన ముందుకు నడిపిస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ ను కొనియాడారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయా యని రాబోయే రోజుల్లో బిఆర్ ఎస్ యే మళ్లీ అధికారంలోకి వస్తుందనె ఆశాభావం వ్యక్తం చేశాడు . ప్రభుత్వం పని తీరుకు గ్రామాల్లల్లో గల అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూగల సత్యం, కొప్పుల సురేష్, బి రామస్వామి, రంగు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.