టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేస్ లో A2 మల్యాల మండల వాసి..!

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేస్ లో A2 మల్యాల మండల వాసి..!

ముద్ర, మల్యాల: రాష్ట్రoలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ లికేజ్ వ్యవహారం కేసులో అరెస్ట్ అయినా ఎ2 ముద్దాయి జగిత్యాల జిల్లా వాసి కావడం, స్థానికంగా కలకలం రేపుతోంది.. వివరాలు ఇలా ఉన్నాయి... కొంతకాలంగా టీఎస్ పిఎస్సీలో ఔట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్న అట్ల రాజేశేఖర్రెడ్డిది జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, తాటిపల్లి గ్రామం. అయితే ఇటీవల జరిగిన పలు పరీక్షలకు సంబందించిన వెబ్ సైట్ హ్యాక్, ప్రశ్నపత్రం లీక్ తెలిసిందే.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసిన పోలీసులు రాజశేఖర్ రెడ్డి భాగస్వామ్యం ఉందని తేల్చి, అరెస్ట్ చేశారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి పేపర్ లీకేజ్ కేస్ లో ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రాజశేఖర్ అలాంటివాడు కాదని, ఎవరైనా ఒత్తిళ్ల కారణంగా.. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇరుక్కొని ఉంటాడని... కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా, ప్రభుత్వం మరిన్ని పరీక్షలు రద్దు చేసే క్రమంలో.. లీకేజ్ వ్యవహారంపై ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సి ఉండగా, రాజశేఖర్ వ్యక్తిత్వం, ఇతర అంశాలపై పోలీసులు గ్రామానికి వెళ్లి విచారిస్తున్నట్లు తెలిసింది.