దుకాణ సముదాయంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

దుకాణ సముదాయంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ రేణుక మాత ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న దుకాణ సముదాయంకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. 25 లక్షల రూపాయలతో నిర్మించే సముదాయంకు మొదటి విడతగా 10 లక్షల రూపాయలు కేటాయించినట్లు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్ లక్ష్మీ నారాయణ, పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు గడ్డమీద కృష్ణ గౌడ్, గౌడ సంఘం నాయకులు ముత్యంగౌడ్, ప్రవీణ్ గౌడ్, అశోక్ గౌడ్, జనార్దన్ గౌడ్, రమేష్ గౌడ్, కృష్ణ గౌడ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, మాజీ వైస్ చైర్మన్ అశోక్  తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పద్మాదేవేందర్ రెడ్డి రేణుకా మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.