పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాం..
  • రాజకీయాలను ప్రభావితం చేసేలా పోలీసులు తీరు ఆక్షేపనీయం.
  • పోలీసులు స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తే స్వాగతిస్తాం..
  • అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురిలో ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తో కలిసి పోలీసులు కార్యక్రమాలు నిర్వహించటం పై  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడాతు ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ శాఖకు చెందిన వారైనా నిష్పక్షపాతంగా వ్యహరించాలని అన్నారు. ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సూచనల మేరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికల్లో ప్రధానమైన ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ, పోలీసులు శాఖలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా..ప్రజల్లో అపోహలు కలిగేవిధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసుశాఖ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని, రాజకీయాలను ప్రభావితం చేసేలా పోలీసులు, సోషల్ సర్వీస్ సంస్థ తో కార్యక్రమం నిర్వహించడం నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు.

స్వచంద సంస్థలు స్వచ్ఛందంగా  సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం పై  తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని సోషల్ ఆర్గనైజేషన్స్, రాజకీయాలకు అనుబంధంగా సంస్థలు రాజకీయాల్లో ప్రభావిత చేసే అవకాశం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా, స్వతంత్రంగా, నిష్పాక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఎన్నికల నియమావళి అమలుకు రాబోతున్న సమయంలో ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి  స్నేహ లత అధ్వర్యంలో కార్యక్రమాలు చేయడాన్ని తప్పుబట్టారు. రాజకీయాలను ప్రభావితం చేసే రాజకీయ అనుబంద సంస్థ ఎల్ ఎం కొప్పుల ఆర్గనైజేషన్ తో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆశ్చర్యకరమన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో పోలీసులు స్వతంత్రంగా నిర్వహించాలి.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనను అభినందిస్తామన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం పక్షపాత ధోరణి తో వ్యవహరిస్తే అదుపు చేయాల్సింది  జిల్లా స్థాయి అధికారి, జిల్లా స్థాయి అధికారె నియమాలను ఉల్లంఘించి, కింది స్థాయి అధికారులకు ఏవిధమైన సంకేతాలు ఇవ్వాలనుంకుంటున్నారని ప్రశ్నించారు. తాము ఏది మాట్లాడిన లిఖిత పూర్వకంగా ఆధారాలతో మాట్లాడుతామని, త్వరలో మరో ఎపిసోడ్  విడుదల చేస్తామన్నారు. ఉద్యోగులు నియమ నిబంధనలకు అనుగుణంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ సందర్బంగా పోలీసులు, ఎల్ ఎం కొప్పుల స్వచ్చంద సంస్థ రూపొందించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ సమావేశంలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమారు,పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, గాజంగి నందయ్య, కల్లే పల్లిదుర్గయ్య, గాజుల రాజేందర్, మన్సూర్, నేహాల్,  చందా రాధాకిషన్, దరా రమేష్ బాబు, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి,బొల్లి శేఖర్, రఘువీర్ గౌడ్ మామిడిపల్లి మహిపాల్, బిరం రాజేష్, పాల్గొన్నారు.