పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
  • ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు
  • రాచర్ల తిమ్మాపూర్ లో ముదిరాజుల ఆందోళన

ముద్ర,ఎల్లారెడ్డిపేట: ముదిరాజులపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ఎల్లారెడ్డిపేట మండలం  రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో శనివారం దగ్ధం చేశారు. తన చిత్రపటానికి చెప్పుల మాల వేసి ఊరేగించారు. అనంతరం శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.మొన్న పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే తమ కులాన్ని అగౌరపరిచినందుకు పాడి కౌశిక్ రెడ్డికి పాడె కడుతామని  ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  ముదిరాజులందరికీ క్షమాపణ చెప్పాలని లేనియెడల  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజుల మందరము ఆందోళనకర చేపడతామని హెచ్చరించారు.

అదేవిధంగా  హుజురాబాద్ లో  ఓ యూట్యూబ్ జర్నలిస్టును  కిడ్నాప్ చేసి నానా బూతులు తిట్టి బెదిరింపులకు గురి చేశాడని ఒక ఎమ్మెల్సీగా ఉంటూ రాష్ట్ర గవర్నర్ మహిళ తమిళ సై సౌందర్య రాజన్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జాతీయ మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి చివాట్లు పెట్టిన విషయం తెలిసిందే ప్రజా జీవితంలో ఉండి  ఒక ఎమ్మెల్సీగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ముదిరాజులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల తిమ్మాపూర్ ముదిరాజ్ కులస్తులు కణమేని సాయిలు,పర్స సత్తయ్య, నాగరాజు, దేవేందర్,గడ్డమీద రాజయ్య, సురేష్, ప్రవీణ్, దేవరాజు, తిరుపతి, అనిల్,గోపాల్, హరీష్, అజయ్ అశోక్ రాజు, తదితరులు పాల్గొన్నారు.