మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో జరుగుతున్న మన ఊరు - మన బడి కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి గురువారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం పనులు చూసిన అనంతరం ఆయన పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరిత, సర్పంచ్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.