టిఫిన్ బండి వద్ద సరదాగా దోసెలు వేసిన రాహుల్.. తానే స్వయంగా వేసుకున్న దోసె తిన్న రాహుల్ 

టిఫిన్ బండి వద్ద సరదాగా దోసెలు వేసిన రాహుల్.. తానే స్వయంగా వేసుకున్న దోసె తిన్న రాహుల్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి జగిత్యాలకు వస్తు  మార్గ మధ్యలో మల్యాల మండలం నూకపల్లి న్యాక్ బస్సు  స్టాప్ వద్ద రాహుల్ గాంధీ ఆగారు. అక్కడే ఉన్న శ్రీ వేంకటేశ్వర పుడ్ ట్రక్ బండి వద్దకు వెళ్ళి సరదాగా ఇద్దరు కష్టమర్లకు స్వయంగా దోసెలు వేసి ఇచ్చారు. అలాగే తాను కూడా వారితో కలిసి దోష తిని వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలాగే స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించి రాహుల్ చిన్నారులకు చాక్లెట్స్ అందించారు.