ఆకలితో ఉన్న వారి కడుపు నింపినప్పుడే మానసిక తృఫ్తిగా ఉంటుంది - రాపర్తి కేశవ్ గౌడ్

ఆకలితో ఉన్న వారి కడుపు నింపినప్పుడే మానసిక తృఫ్తిగా ఉంటుంది - రాపర్తి కేశవ్ గౌడ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : ఆకలితో ఉన్న వారి కడుపు నింపినప్పుడే మానసిక తృప్తి లభిస్తుందని సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశేషకులు (ఆర్కే) అన్నదాన దాత రాపర్తి కేశవ్ గౌడ్ అన్నారు.  జిల్లా కేంద్రంలోని మానసనగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు రాపర్తి సరిత, రాపర్తి మంగమ్మసాయి రేవంత్ లతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు భక్తిమార్గాన్ని అలవర్చుకోవాలన్నారు. అన్ని దానాల కన్న అన్నదానం ఎంతో గొప్పదని చెప్పారు. సూర్యాపేట ప్రజలు విఘ్నేశ్వరుని చల్లనిచూపుతో సుఖసంతోషాలతో ఉండాలని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ సింగ్, వెంకటయ్య, ,  రాపర్తి సురేష్ శనగాని గోవర్ధన్, పవన్, లోకేష్, వెంకటయ్య, కందాల సత్తిరెడ్డి, మహేందర్ రెడ్డి కడారి వెంకన్న నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.