సిపిఐ నేత వెంకటయ్య మృతికి సంతాపం
![సిపిఐ నేత వెంకటయ్య మృతికి సంతాపం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650f1e7ac638d.jpg)
హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) నాయకుడు, కార్మికోద్యమ నేత గాలి వెంకటయ్య మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) జాతీయ కార్యవర్గ సభ్యుడు కే సత్యనారాయణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతంలో కార్మిక ఉద్యమానికి మారుపేరుగా నిలిచిన వెంకటయ్య రిక్షా కార్మిక సంఘాన్ని నడిపారని, రైస్ మిల్లులలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలను, హమాలి ముఠాలను ఏర్పాటు చేశారని సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు, కార్మిక ఉద్యమ నేత బొమ్మగాని ధర్మ బిక్షం నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ పటిష్టానికి కార్మికోద్యమ నిర్మాణానికి వెంకటయ్య కృషి చేశారని ఆయన ప్రశంసించారు.