గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ ప్లాన్!
![గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ ప్లాన్!](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64ab99fc84929.jpg)
- చేరికలపై రేవంత్రెడ్డి భారీ స్కెచ్
- బీఆర్ఎస్, బీజేపీ నేతలతో రహస్య మంతనాలు
- జూలై 20న కొల్లాపూర్ లో ప్రియాంక సమక్షంలో భారీగా చేరికలు
- అదే వేదికగా మహిళా డిక్లరేషన్, వడ్డీలేని రుణాలు, రిజర్వేషన్లపై ప్రకటన?
- ప్రియాంకకు దక్షణాది రాష్ట్రాల బాధ్యతలు?
- బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కూచుపల్లి రాజీనామా
ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ పావులు కదుపుతోంది. ఇప్పటికే కర్ణాటక గెలుపులో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలో ఒక్కొక్కటీగా అమలు చేస్తోన్న కాంగ్రెస్..ముఖ్యంగా చేరికలపై దృష్టిసారించింది. ఈ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి ఓ ప్లాన్ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చేరికలపై భారీ స్కెచ్వేసిన రేవంత్రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అసంతృప్తులతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేరికతో మంచి బూస్టింగ్లో ఉన్న ఆ పార్టీ.. కాంగ్రెస్వైపు చూస్తోన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 20న నాగర్కర్నూల్జిల్లా కొల్లాపూర్లో జరిగే బహిరంగ సభకు హాజరువుతోన్న ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలను పార్టీలో చేర్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
కూచుపల్లి రాజీనామా..
నాగర్ కర్నూల్డీసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్లొన్న కూచుకుల్ల ఆదివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 20న కొల్లాపూర్ సభలో ఆయన కాంగ్రెస్కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మహబూబ్నగర్మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ, మహబూబాద్, ఆదిలాబాద్మాజీ ఎంపీలు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రవీంద్రనాయక్, రాథోడ్రమేశ్, గద్వాల జెడ్పీ చైర్పర్సన్సరిత, మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్,మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, ఆదిలాబాద్కు చెందిన రామారావ్పటేల్, పాల్వాయి హరీశ్రావు, కాజీపేట లింగయ్య, డోకూరి పవన్కుమార్రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రియాంక హాజరుకానున్న ఈ సభను.. ఖమ్మం రాహుల్సభకు దీటుగా నిర్వహించేందుకు జూపల్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ప్రియాంక కీలక ప్రకటనలు?
వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఆకర్శించేందుకు తహతహలాడుతోన్న కాంగ్రెస్ఇప్పటికే రైతు, యూత్, భూడిక్లరేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. కొల్లాపూర్సభకు విచ్చేస్తోన్న ప్రియాంక గాంధీ ద్వారా మహిళా డిక్లరేషన్ప్రకటనతో పాటు మహిళలకు వడ్డీలేని రుణాలు, పార్టీలో సీట్ల కేటాయింపుపైనా ప్రకటన చేయించే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తోన్న కాంగ్రెస్ఇప్పటికే మెదక్నుంచి బరిలో ఉండాలని ప్రియాంకను కోరుతోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో జరిగే బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాలకు ప్రియాంకను ఆహ్వానించాలని ఇప్పటికే టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో కర్ణాటక ఫలితాలతో జోష్లో ఉన్న హస్తం పార్టీ తాజాగా దక్షణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రియాంకను దక్షిణాది రాష్ట్రాల బాద్యతలు కూడా అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.