ఇంకా లభించని సబ్మెరైన్ ఆచూకీ!
- ఆక్సిజన్ ఖాళీ.. గాలింపు చర్యలు ముమ్మరం
అట్లాంటిక్:-ఆర్థిక దిగ్గజాలతో టైటానిక్ ప్రాంత శకలాలను చూసేందుకు ఓషన్గేట్ ఎక్స్పెడిషన్స్ కు చెందిన సబ్ మెరైన్ జాడ ఇంకా లభించలేదు. గురువారం సాయంత్రం 4.30 గంటల వరకూ ఇందులో సరిపడా ఆక్సిజన్ ఉండడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. సబ్మెరైన్ జాడ కోసం అమెరికా రక్షణ రంగానికి చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా వెతుకుతున్నాయి. సబ్మెరైన్కు సంబంధించిన సిగ్నల్స్ అందుతున్నప్పటికీ అవి ఎక్కడి నుంచి అందుతున్నాయి. ఎంత దూరం నుండి వస్తున్నాయనే విషయంలో గాలింపు బృందాలకు స్పష్టత దొరకడం లేదు. గాలింపు చర్యలు కాస్త దశ, దిశ లేనట్లుగా కొనసాగిస్తున్నాయనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ సబ్మెరైన్లో ఐదుగురు ప్రయాణికులున్నారు. సోనార్ నీటి అడుగున గుర్తుతెలియని శబ్దాలను నిపుణులు గుర్తించారు. దీంతో కోస్ట్ గార్డ్ అధికారులు సబ్మెరైన్ జాడ కనిపెడతామన్న ధీమాలో ఉన్నా, ఆక్సిజన్ అయిపోయే సమయం ఆసన్నం కావడంతో ఆందోళన నెలకొంది. అందులో ఉన్న సిబ్బందిని సజీవంగా గుర్తించడం, వారిని వెలికితీయడం సవాలుగా మారింది. కాగా సముద్రం నుంచి వస్తున్న సిగ్నల్స్పై నిపుణుల మధ్యే భిన్నవాదనలు నెలకొన్నాయి. సబ్మెరైన్వి కావని కొందరు నిపుణులు భావిస్తుంటే, మరికొందరేమో అవి ఖచ్చితంగా సబ్మెరైన్నుంచి అందుతున్న సిగ్నల్సే అని అనుకూంటూండడం విశేషం.
1912 ఏప్రిల్ 14, 15 తేదీల మధ్యరాత్రి టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కేవలం మూడు గంటల్లో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 1500,650 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాకు 3 కిలోమీటర్ల దూరంలో 3,843 మీటర్ల లోతులో నౌక రెండు ముక్కలుగా చీలి మునిగిపోయింది. రెండు ప్రాంతాలు ఒకదానికొకటి 800 మీటర్ల దూరంలో ఉన్నాయి. జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమా తీసిన తర్వాత టైటానిక్ ఖ్యాతి చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. ఆ సమయంలోనే అది అక్కడి హిమానీనదాల్లో కూలిపోయినట్లు వారు గుర్తించారు.