మంత్రి హరీష్ రావును కలిసిన తూప్రాన్ నాయకులు
![మంత్రి హరీష్ రావును కలిసిన తూప్రాన్ నాయకులు](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64bf7f19b62e2.jpg)
తూప్రాన్, ముద్ర: పట్టణ పద్మశాలి సంఘం భవన నిర్మాణం, మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం సభ్యులు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు కేటాయిస్తామని హామి ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మ శాలి సంఘం అధ్యక్షులు నందాల దుర్గా ప్రసాద్, యూత్ అధ్యక్షులు బొడ్డు రాఘవేందర్, ప్రదాన కార్యధర్శి కొండ రాజు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.