ఎకరాకు 30 వేలు చెల్లించాలి

ఎకరాకు 30 వేలు చెల్లించాలి

కల్వల ప్రాజెక్ట్ ను సందర్శించిన సుగుణాకర్ రావు

శంకరపట్నం, ముద్ర: శంకరపట్నం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గండిపడ్డ కల్వల ప్రాజెక్టు, ఇసుక మేటలు పెట్టిన పంట పొలాలను సోమవారం బిజెపి సీనియర్ నాయకులు పొల్సాని సుగుణాకర్ రావు బిజెపి శంకరపట్నం మండల నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు మత్స్యకారులు బాగా నష్టపోయారని పేర్కొన్నారు. వరదల కారణంగా పొలాలలో ఇసుకమేటలు ఏర్పడడం వల్ల రైతులు చాలా నష్టపోయారని ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజు, బీజేపీ మండల అధ్యక్షులు ఎనుగుల అనిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్, అప్పాని తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి దాసరపు నరేందర్, బిజెపి సీనియర్ నాయకులు చల్ల ఐలయ్య, మండల నాయకులు రాజేందర్, మహేందర్ రెడ్డి, కనకం సాగర్, సారయ్య, సాయి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు