మేడారం జాతర సందర్భంగా ఆ జిల్లాలోని విద్యార్థులకు 5 రోజుల సెలవులు...

మేడారం జాతర సందర్భంగా ఆ జిల్లాలోని విద్యార్థులకు 5 రోజుల సెలవులు...

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.ఈ జాతర ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24వ తేదీ వరకు సాగనుంది. ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేశారు. రవాణా పరంగానూ తెలంగాణ ఆర్టీసీ 6వేల స్పెషల్ బస్సులను కూడా నడుపుతోంది. ఇటు మేడారం జాతరకు వచ్చే భక్తులకోసం జంపన్న వాగు, పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

కాగా మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. 4 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 4 రోజులుపాటు జిల్లాలో ఉన్న విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు. ఆదివారం సెలవు కావడంతో వరుసగా 5రోజుల పాటు సెలవులు వచ్చాయి.ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఈ జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.