స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్

బాషా ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 37 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు సమస్యలు తలెత్తడానికి గల కారణాలు తెలుసుకొని వాటి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఖిల్లాలో జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయా శాఖల ద్వారా వారికి కేటాయించిన విధులను క్రమశిక్షణగా పూర్తి చేసి విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటలకు సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఉంటుందని అధికారులు హాజరుకావాలన్నారు . అనంతరం ఖిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ జెండా ఆవిష్కరణతో ప్రారంబించి, పోలీసు గౌరవ వందనం, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షిప్త సమాచారం, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, వివిధ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.