ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ముద్ర ప్రతినిధి, జనగామ (లింగాలఘణపురం) : ప్రజా సంక్షేమమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని బీఆర్‌‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌ పూర్‌‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో దీప్తి ఫంక్షన్ హాల్‌లో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

కార్యకర్తలను మమేకం చేసేందుకే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, -వారి కష్టసుఖాల్లో  పాల్పంచుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య సతీమణి ఫాతిమా మేరీ, జడ్పీటీసీ గుడి వంశీధర్‌‌రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం, పార్టీనికి చెందిన మండల నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.