బిజెపి శ్రేణుల సంబరాలు
![బిజెపి శ్రేణుల సంబరాలు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641477225992f.jpg)
- తెలంగాణ లో రాబోయేది బిజేపీ సర్కారే
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
ముద్ర ప్రతినిధి కరీంనగర్ :
ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి ఏ వి న్ రెడ్డి విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ చౌక్ లో సంబరాలు నిర్వహించారు. సందర్భంగా బిజెపి శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు , జిల్లా ఇన్చార్జి , మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ ప్రభాకర్ ,జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, తెలంగాణకి ప్రతిబింబంగా ఉన్న హైద్రాబాద్ ,రంగారెడ్డి, మహబూబ్ నగర్.శాసనమండలి ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బిజెపి అభ్యర్థి ఘన విజయం సాధించడం చారిత్రకమన్నారు. దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాల కంటే ఎంతో విశిష్టమైనదన్నారు. సాదాసీదాగా బయటకు కనిపించే ఈ ఎన్నిక రాబోయే తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పబోతుందని , తెలంగాణలో రాబోయేది బిజెపి సర్కారే అన్నారు. కెసిఆర్ ప్రభుత్వ ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలను పరిపక్వత గల మధ్య తరగతి ప్రజానీకం ,మధ్య వయస్సు గల వారు ఓటు వేసిన ఈ ఎన్నికను అత్యంత శాస్త్రీయమైన ఎన్నికల సర్వే గానే భావించాల్సి ఉందన్నారు . విజయాన్ని అందించిన ఉపాధ్యాయులందరికీ బిజెపి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల్ల ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ,కళ్లెం వాసుదేవరెడ్డి బత్తుల లక్ష్మీనారాయణ,కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, మాడ వెంకట్రెడ్డి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, మీడియా కన్వీనర్ కట్టంలోకేష్, వైదా రామానుజన్, అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి, ఎడమ సత్యనారాయణ రెడ్డి, చొప్పరి జయశ్రీ, బండ రమణారెడ్డి ,జాడి బాల్రెడ్డి, దుబాల శ్రీనివాస్, పుప్పాల రఘు, గొడుగు వినోద్, ఆవుదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, సొల్లు అజయ్ వర్మ మామిడి చైతన్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బూత్ సశక్తికరణ్ అభియాన్ విజయవంతం చేయాలి
పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన సశక్తి కరణ్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు , కరీంనగర్ ఇన్చార్జి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో బిజెపి స శక్తి కరణ్ అభియాన్ సమీక్ష సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగాశక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ సమావేశాలు విజయవంతంగా పూర్తి చేసినందున, బూత్ పరిధిలో చేపట్టిన సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమాన్ని అదే స్థాయిలో విజయవంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్ పరిధిలో బూతు స్థాయి శ్రేణులఅందర్నీ కలుపుకొని, పార్టీ సూచనల ను పరిగణలోకి తీసుకొని స్వశక్తికరన్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.