జనగామలో చెస్ట్ హాస్పిటల్ ప్రారంభం

జనగామలో చెస్ట్ హాస్పిటల్ ప్రారంభం

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామలో ఏర్పాటు చేసిన లక్ష్మీ వెంకటేశ్వర చెస్ట్ & జనరల్ హాస్పిటల్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటగా ఏర్పాటు చేసిన చెస్ట్ హాస్పిటల్ లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు.

కార్యక్రమంలో డాక్టర్లు వి.ప్రవీణ్, కె.లక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, లింగాలఘణపురం జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, కౌన్సిలర్లు బండ పద్మ, గాడిపెళ్లి ప్రేమలతారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, డాక్టర్లు పాల్గొన్నారు.