ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేశారు. జిల్లా ఉద్యమంలో పాల్గొన్న ఉడుగుల రమేశ్‌, ఎండీ మాజీద్‌, మంతెన మణి కుమార్, తీగల సిద్దుగౌడ్, గడ్డం కృష్ణ, కర్రె సతీశ్‌ కేసుల పాలై ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా వారు సోమవారం జనగామ కోర్టులో హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ఉద్యమకారులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరారు.