రఘునాథపల్లిలో రైతు సజీవ దహనం..

రఘునాథపల్లిలో రైతు సజీవ దహనం..

గడ్డికి నిప్పుపెడుతుండగా ప్రమాదం

ముద్ర ప్రతినిధి, జనగామ (రఘునాథపల్లి): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఓ రైతు సజీవ దహనం అయ్యాడు. రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు మామిడి యాదగిరి(70) తన వ్యవసాయ బావి వద్ద గడ్డిని తొలగించి నిప్పంటిస్తుండగా అకస్మాత్తుగా మంటలు లేచి అతడికి అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.