ఎఫ్ ఎన్ సి సి మీడియా కమిటీ చైర్మన్ గా కే. సత్యనారాయణ

ఎఫ్ ఎన్ సి సి మీడియా కమిటీ చైర్మన్ గా కే. సత్యనారాయణ

హైదరాబాద్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి) మీడియా కమిటీ చైర్మన్ గా కే సత్యనారాయణ నియమితులయ్యారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ ) జాతీయ కార్యవర్గ సభ్యుడుగా ఉన్న సత్యనారాయణ ఫిలింనగర్ క్లబ్ మీడియా, వెబ్ సైట్,  న్యూస్ లెటర్, సబ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎఫ్ ఎన్ సి సి అధ్యక్ష, కార్యదర్శులు ఘట్టమనేని శేషగిరిరావు, ముళ్ళపూడి మోహన్ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో ఈ విషయం ప్రకటించారు.