మూగ విద్యార్థులకు ఉచిత బస్ పాసులు

మూగ విద్యార్థులకు ఉచిత బస్ పాసులు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పెద్ద పెండ్యాల (కరుణ పురం) లిటిల్ ఫ్లవర్ డెఫ్ అండ్ డం పాఠశాల కు చెందిన 500 మంది విద్యార్థులకు ఉచిత బస్సులు అందించారు. మహాత్మా గాంధీ ఫెలోషిప్ ఆర్థిక సహాయం, వాకర్స్ ఇంటర్నేషనల్ 303 సహకారంతో ఏడాది పాటు రాష్ట్రం అంతట ఉచిత ప్రయాణం చేసి బస్సు పాసులను ఇప్పించారు. కార్యక్రమానికి వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్.సి. తడక కుమారస్వామి, మహాత్మా గాంధీ ఫెలోషిప్ కార్యదర్శి బూర రామచందర్, ఈసీ ఉపేందర్ రెడ్డి, చక్రపాణి, తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంతోష్, వీరన్న, మహేందర్, శ్యామ్, స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.