ఓటేసిన గవర్నర్లు దత్తాత్రేయ, ఇంద్రసేనా రెడ్డి
![ఓటేసిన గవర్నర్లు దత్తాత్రేయ, ఇంద్రసేనా రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_656854358ef75.jpg)
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డిలు వినియోగించుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం లోని రామ్ నగర్ జేవీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అలాగే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మలక్ పేట పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.