కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయం

కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయం
  • వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల ప్రజలు చేస్తున్న శపదాలే దీనికి నిదర్శనం
  • కాంగ్రెస్ నేతలకు నేను శత్రువైతే, వారు మాత్రం ప్రజల శత్రువులు
  • ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి ఓటు వేయమని చెప్పిన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్
  • పదవులే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు
  • కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజాధనం ఆ నేతల జేబుల్లోకి వెళితే... బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ప్రజలకు వెళుతుంది 
  • కాంగ్రెస్ పార్టీని మరోసారి క్రిష్ణ లో కలపడం ఖాయం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి ఓటు వేయమని చెప్పిన దొంగలు కోమటిరెడ్డి బ్రదర్స్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గం లోని శాలగౌరారం లో మీడియా తో మాట్లాడిన మంత్రి,కాంగ్రెస్ పార్టీని మరోసారి ప్రజలు క్రిష్ణ లో కలపడం ఖాయం అన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్ ఓటమి ఖాయం అన్నారు.వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల ప్రజలు చేస్తున్న శపదాలే దీనికి నిదర్శనం అన్నారు.

కాంగ్రెస్ నేతలకు నేను శత్రువైతే, వారు మాత్రం ప్రజల కు శత్రువులు అని పేర్కొన్నారు. వారికి పదవులే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజాధనం ఆ నేతల జేబుల్లోకి వెళితే... బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ డబ్బులు ప్రజల జేబులో కి వెళతాయి అని అన్నారు.