బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు
![బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64afd3a5847f6.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-జిల్లాలో యస్.సి./యస్.టి అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్, సంబంధిత అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటోరింగ్ కమిటీ సమావేశం లో జిల్లా యస్.పి. రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, యస్. మోహన్ రావు తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి మూడు నెలలోకసారి సమావేశం ఏర్పాటు చేసి బాధితుల సమస్యల పై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కోర్డులలో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేలా కమిటీ సభ్యులు కృషి కూడా చేయాలని అన్నారు. జిల్లాలో 109 అట్రాసిటీ కేసుల పరిష్కారంలో భాగంగా ఇప్పటి వరకు 36 మందికి దాదాపు రూ.26 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. సూర్యాపేట కోదాడ సబ్ సబ్ డివిజన్ల పరిధిలో 21 కేసులు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డి.యస్.డి.ఓ దయానంద రాణి, ఈ. డి యస్.సి. కార్పొరేషన్ శిరీష, డిటీడీఓ శంకర్, డి.యస్.పి లు నాగభూషణం, రవి, కమిటీ సభ్యులు సి.హేచ్. చిన్న రాములు, జి.సైదులు, యన్. ప్రకాష్ బాబు, జి.అచ్చమ్మ, తదితరులు పాల్గొన్నారు.