అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం ముత్యంపేట (కొండగట్టు) శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రామారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నూతన వాహన పూజ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చిరంజీవి, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు ఉన్నారు.