ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ కు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సై

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ కు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సై
  • మునగాల సబ్ స్టేషన్ ముందు రాజీనామా లెటర్ తో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
  • భారీగా చేరుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలు
  • పోలీసుల బందోబస్తు

మునగాల ముద్ర :-భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు 10 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తా రాజీనామా చేస్తావా అని మంత్రి కేటీఆర్ కు విసిరిన సవాల్ పై కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ కు సై అన్నారు. గురువారం తన రాజీనామా పత్రంతో మునగాల విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చేరుకొని దమ్ముంటే సబ్ స్టేషన్ వద్దకు రావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కి సవాల్ విసిరారు.

అనంతరం వందలాది మంది రైతులతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మండు వేసవిలో కూడా కోతలు లేకుండా ప్రజలకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు .రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమైనవి అని అన్నారు ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలుస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ అజయ్ కుమార్ కందిబండ సత్యనారాయణ నియోజకవర్గ స్థాయి నాయకులు రైతు సమన్వయ సమితి నాయకులు ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.