కరీంనగర్ లో మిస్టరీ డెత్

కరీంనగర్ లో మిస్టరీ డెత్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ లోని శనివారం మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాచర్ల భవాని మరణం మిస్టరీగా మారింది. హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం నిద్ర మాత్రలు మింగిందని భర్త రాచర్ల విజయ్ స్థానిక అపోలో రీచ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  మరణించిందని డాక్టర్లు ధ్రువీకరించగా గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కరణలకు పూనుకున్నారని తల్లి లలిత ఆరోపిస్తుంది. భవాని మెడ చుట్టూ తీవ్ర గాయాలు ఉన్నాయని, తన బిడ్డ మరణంపై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: ఆర్టీసీ బస్సు ఢీకొని మత్స్య కారుడు మృతి

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. రాచర్ల విజయ్ - భవానీలకు 8 నెలల బాబు ఉన్నాడు. తరచు వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, భవానిని నిత్యం వేధించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. భవానిది హత్యా లేక సాధారణ మరణమా తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్ తో భవాని మరణం మిస్టరీ వీడనుంది.