17న "ఇప్పుడొక ఊరుకావాలి" పుస్తకావిష్కరణ సభ

17న "ఇప్పుడొక ఊరుకావాలి" పుస్తకావిష్కరణ సభ

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: ప్రముఖకవి, రచయిత, కొండిమల్లారెడ్డి, కవిత్వసంపుటి "ఇప్పుడొక ఊరుకావాలి" ఆవిష్కరణ సభ సోమవారం సాయంత్రం 5గంటలకు సిద్ధిపేట శివాను భవమండపంలో ఉంటుందని  సిద్దిపేట వెన్నెల సాహితీ సంగమం అధ్యక్షులు వంగర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరిలు తెలిపారు.

ఈ సభకు ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు కూర రఘోత్తంరెడ్డి, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గాజోజు నాగభూషణం హాజరవుతున్నారని తెలిపారు. కావునకవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయలని కోరారు.