యుద్దభేరికి భారీగా తరలిన పద్మశాలి కులస్థులు

యుద్దభేరికి భారీగా తరలిన పద్మశాలి కులస్థులు

ముద్ర, మల్యాల:రాజ్యాధికార సాధన కోసం... ఆదివారం చేపట్టిన ఛలో కోరుట్ల పద్మశాలి రాజకీయ యుద్దభేరి కార్యక్రమానికి మండలం నుంచి దాదాపు వెయ్యి మంది పద్మశాలి కులస్థులు తరలి వెళ్లారు. ఆయా గ్రామాల కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పద్మశాలి కులస్థులు ర్యాలీగా వాహనాల్లో తరలి వెళ్లారు. మల్యాల సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, సంఘాల పెద్దలు ముల్క మల్లయ్య, సామల దేవరాజం, బింగి వేణు, బోడ గోవర్ధన్, వేముల సంతోష్, మిట్టపల్లి దశరథo, గాజుల రాములు, దూస వెంకన్న, గాజుల మల్లేశం, బాలే సంజీవ్, భోగ రాజు, తదితరులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.