నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని పూజలు
కమాన్ పూర్ రామగుండం కార్పొరేషన్ 8 వకాలనీలోని అల్లూరు దర్గాలో ప్రత్యక్ష పూజలు చేయడం జరిగింది టీఎన్ఎస్ఎఫ్ పెద్దపెల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్ర విజయవంతం కావాలని ఎనిమిదవ కాలనీలోని అల్లూరు దర్గాలో ప్రత్యక్ష పూజలు చేయడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో అన్యాయాలను అక్రమాలకు అరికట్ట వేయడానికి బయలుదేరిన యువ నాయకుడు నారా లోకేష్ 4000వేల కిలోవిూటర్లు పాదయాత్ర చేస్తూ పేద ప్రజల సమస్యలను తెలుసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పడిన నారాచంద్రబాబు నాయుడు ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి జరుగుతుందని ఎన్ని సమస్యలు ఎదురైనా గానీ జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కానీ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది తెలిపారు ఈ కార్యక్రమం టిఎన్ఎస్ఎఫ్ పెద్ద పల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి . వాజిద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు సయ్యద్ అఖిల్ బాబా పాల్గొనడం జరిగింది. టీఎన్ఎస్ఎఫ్ కార్పొరేషన్ అధ్యక్షుడు సాయికుమార్. కొండి శీను. జున్ను. రెమ్మ సతీష్. రాజేశం. కుమార్. తేజ. శ్రావణ్ పాల్గొన్నారుపంటలు బాగా పండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి :` ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కమాన్ పూర్ జనవరి 27పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు దేవతలను వేడుకున్నారు. కమాన్ పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామములో శ్రీ భూలక్ష్మీ శ్రీ లక్ష్మి బొడ్రాయి పోచమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి,మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ తల్లుల దీవెనలు తెలంగాణ ప్రజల పైన నిండుగా ఉండాలి. అని అన్నారు.వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండెలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ షీలారపు మల్లయ్య శశి భూషణ్ కాచే బొంపల్లి రాజయ్య బిల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.