పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్పోర్ట్స్ మీట్స్

పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్పోర్ట్స్ మీట్స్

సిద్దిపేట : ముద్ర  ప్రతినిధి: పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్పోర్ట్స్ మీట్స్ లో భాగంగా శనివారం రోజున మహిళ పోలీసులకు,  పోలీసులకు  టాగ్ఫర్  పోటీలను నిర్వహించారు. మహిళా పోలీస్ జట్లకు,మెన్ పోలీసు జట్లకు సపరేట్గా టగ్గఫర్ పోటీలను  అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్  ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ లు ప్రారంభించారు. సిద్దిపేట సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో మహిళా పోలీసులకు ఆరు టీమ్స్ , మెన్ పోలీసులకు 10 టీమ్స్ మధ్య వేరువేరుగా టగ్గఫర్ పోటీలు నిర్వహించడం జరిగింది .మహిళలలో మధ్య జరిగిన పోటీలలో సిద్దిపేట టౌన్ టీం విజయం సాధించింది. మెన్ మధ్య పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ మాట్లాడుతూ ఈరోజు చివరి రోజు టగ్గ ఫర్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి  మహిళా పోలీస్ అధికారులకు సిబ్బందికి మానసిక ఉల్లాసం స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రతిరోజు  వాకింగ్, రన్నింగ్, యోగ  మరియు స్పోర్ట్స్ ఆడుతూ  ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు టూ టౌన్ రవికుమార్, 3 టౌన్ భాను ప్రకాష్, రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.