కేరళలో విరిసిన కమలం.. స్టార్ నటుడు ఘన విజయం...
![కేరళలో విరిసిన కమలం.. స్టార్ నటుడు ఘన విజయం...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_665ee3bc93853.jpg)
ముద్ర,సెంట్రల్ డెస్క్:-తొలిసారి కేరళ లోక్సభ నుంచి బీజేపీ గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి, మలయాళ నటుడు సురేశ్ గోపీ 2024 లోక్సభ ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి వీఎస్ సునీల్ కుమార్ పై దాదాపు 73వేలకు పైగా ఓట్ల మెజార్టీగాతో గెలుపొందారు.అధిక శాతం విద్యావంతులు ఉన్న కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులు గెలుస్తూ వస్తున్నారు. అయితే.. తొలి సారి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.