టిపిసిసి పర్శీలకురాలు మున్షికి స్వాగతం పలికిన చామల.....

టిపిసిసి పర్శీలకురాలు మున్షికి స్వాగతం పలికిన చామల.....

ఆలేరు (ముద్ర న్యూస్):టిపిసిసి ఎన్నికల పరిశీలకులుగా హైదరాబాద్ కు వచ్చిన దీపా దాస్ మున్సి కి ఆదివారం నాడు హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బిజెపి. బిఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగితే రానున్న ఎన్నికలలో కేంద్రంలో. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు ఖాయం అని జోష్యం చెప్పారు.