ఘనంగా తెలంగాణ హరితోత్సవం..
![ఘనంగా తెలంగాణ హరితోత్సవం..](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64903ab25bbb6.jpg)
ముద్ర పాలకీడు .తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా మండలంలోనీ గుడుగుంట్ల పాలెం గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు క్రిష్టిపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు,వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీదేవి, ఎంపిఓ దయాకర్, ఏపిఒ రాజు,ఎంపీటీసీ దొంగల వెంకటయ్య,పంచాయతీ కార్యదర్శి నాగపద్మజ,తదితరులు పాల్గొన్నారు.