వనపర్తి ఎమ్మార్వో ను సన్మానించిన కలెక్టర్
![వనపర్తి ఎమ్మార్వో ను సన్మానించిన కలెక్టర్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64622e5007481.jpg)
ముద్ర ప్రతినిధి, వనపర్తి :జిల్లా అధికారుల్లో ఉత్సాహాన్ని నింపి వారిలో ఉన్న నైపుణ్యతను వెలికి తీయడంతో పాటు వారి సేవలను గుర్తించడానికి ప్రతి వారం ఒక అధికారిని సన్మానించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అయా శాఖల ద్వారా పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉందన్నారు. ఇందులో భాగంగా జిల్లా అధికారులు ఉన్న సిబ్బందితో నే కృషి చేసి ఉత్తమ ఫలితాలు సదిస్తున్నారని ప్రశంసించారు. ఇందుకోసం ఇక నుండి ప్రతి వారం ఒక అధికారి సేవలు గుర్తిస్తూ వారిని ప్రజావాణి అనంతరం అక్కడే సన్మానం చేయడం జరుగుతుందని ప్రకటించారు. గతవారం ఉత్తమ సేవలు అందించిన, స్థానిక తహశీల్దార్ రాజేందర్ గౌడ్ ను ఇన్ని రోజులు చేసిన సేవలను గుర్తించి ఈరోజు సన్మానించారు.