వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయించడంతోనే బిఆర్ఎస్ నుంచి బయటకు

వట్టే  జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయించడంతోనే  బిఆర్ఎస్ నుంచి బయటకు

13 వ వార్డ్ కౌన్సిలర్ వట్టే రేణుక తో సహా సుమారు200 మంది బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బహుజన కులాల అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో జానయ్య పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్వల్ప కాలంలోనే డెబ్బై కి పైగా అక్రమ కేసులు మోపి పార్టీలో అణచివేత ధోరణి పెరుగుతుందని పార్టీ పరంగా జరిగే సమావేశాలకు మాకు ఎలాంటి సమాచారం అందడం లేదని బిఆర్ఎస్ పార్టీలో ఇమడలేకనే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తల తోరాజీనామా చేస్తున్నట్లు 13వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక తెలిపారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లో వట్టే జానయ్య యాదవ్ నివాసంలో శని వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నామని కార్యకర్తలు మాకు అండగా ఉంటున్నారని కారణంతో ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒక్క మాట అన్నందుకే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం శోచనీయమని అణచివేత నిర్బంధాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని పోటీ చేయవద్దని నిర్బంధం మోపటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

ఏ పార్టీలో చేరేది ప్రస్తుతం నిర్ణయించుకోలేదని కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో ఏ పార్టీ లో చేరే నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పనిచేసే వారికి ఎలాంటి పదవులు లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినవారిలో మాజీ ఎంపీపీ భూక్యాకాంత, మాజీ ఎంపిటిసి ముక్కాల పద్మ, ఎల్కారం మాజీ సర్పంచి మోదాల సైదమ్మ, బిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట పట్టణ ఉఫాధ్యక్షులు మహ్మద్ చాంద్ పాషా, సూర్యాపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు కుంభం వెంకన్న యాదవ్, పెన్ పహాడ్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య, పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ వల్లాల సైదులు, రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాల సైదులు, దురాజ్ పల్లి పెద్దగట్టు మాజీ డైరెక్టర్ చింతకాయల జానయ్య, వీరితోపాటు గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వారిలో సుమారు 200 మంది ఉన్నారు.