కారు గుర్తుపై ఓటు వేసి సంజయ్ ను గెలిపించండి

కారు గుర్తుపై ఓటు వేసి సంజయ్ ను గెలిపించండి

సారంగాపూర్ ముద్ర: ఈనెల 30 న జరిగే శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి జగిత్యాల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిజాంబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటర్లు అభ్యర్థించారు. శనివారం బీర్పూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ ని గెలిపించడంతోపాటు రాష్ట్రంలో కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారం లోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎఫ్ తోటి సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి బీడీ కార్మికుల పెన్షన్ అందిస్తామని అన్నారు. అనంతరం తుంగూరు గ్రామానికి చెందిన ఓబుల అజయ్ తమ్ముడు రాకేష్ సుస్మిత లవివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్,మండల నాయకులు, కార్యకర్తలు,మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.