కాంగ్రెస్ లో చీలికలు.. బిఆర్ఎస్ లో చేరికలు

కాంగ్రెస్ లో చీలికలు.. బిఆర్ఎస్ లో చేరికలు

భూదాన్ పోచంపల్లి ,ముద్ర; భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.చేరినవారు ఉప్పుల శేఖర్ రెడ్డి, మన్నే వెంకట్ రెడ్డి, గడ్డం రవి, కట్ట మల్లారెడ్డి, శ్రీనివాస్, కాసుల నరసింహ, బత్తుల ఉపేందర్, మూలమోని వెంకటేష్, శ్యామల లక్ష్మణ్ ,పోనమోని కృష్ణ, మహమ్మద్ బాబా చేరారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు. అనంతరం పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే దిశగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కోరారు .రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు.