ప్రజా సేవకుడిలా పని చేస్తా...

ప్రజా సేవకుడిలా పని చేస్తా...

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్వె

వెల్గటూర్, ముద్ర: ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండి, సేవకుడిలా పని చేస్తానని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎండపల్లి మండలంలోని రాజరాంపల్లి గ్రామంలో గల  ఓ ఫంక్షన్ ప్యాలెస్ లో" క్రిస్మస్ " పండగను పురస్కరించుకొని క్రైస్తవులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన దుస్తుల పంపిణీ  మరియు కళ్యాణ  లక్ష్మికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాలను అధికారులు నిర్వహించగా దానికి లక్ష్మణ్ కుమార్ హాజరై మాట్లాడారు.

ప్రజల ఆశీస్సులతో తాను మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచానని, ఎవ్వరి పై ఎటువంటి ద్వేషం పెంచుకోకుండా అందరికీ తన సేవలను అందిస్తానని అన్నారు. మీకు ఏ ఆపద వచ్చినా లక్ష్మణ్ కుమార్ ఉన్నాడని మర్చిపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెల్లు శేఖర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఫాస్టర్లు పాల్గొన్నారు.