పార్టీ పటిష్టతకు కృషి చెయ్యండి
![పార్టీ పటిష్టతకు కృషి చెయ్యండి](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647c5b37b38d8.jpg)
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములుయాదవ్
BJP లో చేరిన యువత
ముద్ర, మహేశ్వరం
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు.
ఆదివారం బడంగ్ పేట కార్పొరేషన్ లో పలు డివిజన్ల నుంచి వందలాది మంది యువకులు బీజేపీలో చేరారు. బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు నడికుడి యాదగిరి, బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయం కండువాలు కప్పుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అందరూ పార్టీకి సమయం ఇచ్చి కష్టపడి పని చేయాలని సూచించారు. యువకులు సోషల్ మీడియాలో బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విష ప్రచారం తిప్పి కొట్టాలని శ్రీరాములు చెప్పారు.
ముఖ్యంగా దేశం కోసం, ధర్మం కోసం యువత ఆదర్శభావాలు కలిగి ఉండాలని కోరారు.
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిరంతరం శ్రమించాలన్నారు.
ఈ సందర్భంగా పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న యువకులకు బీజేవైఎంలో నియామక పత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.