సీఎంని ఆశీర్వదించిన యాదాద్రి అర్చకులు

సీఎంని ఆశీర్వదించిన యాదాద్రి అర్చకులు

యాదగిరిగుట్ట, ముద్ర : నూతన సంవత్సరం పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పక్షాన ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం జరిపారు. ఈ కార్యక్రమములో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి  పాల్గొన్నారు.