అనoతరాo బ్రిడ్జి ధ్వంసం అయినందున ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి - జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్
![అనoతరాo బ్రిడ్జి ధ్వంసం అయినందున ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి - జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64c3554c16a25.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత నాలుగు రోజులు గా కురుస్తున్న భారీ వర్షల కారణంగా జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్లే రహదారిలో రూరల్ మండలం అనoతారాo వద్ద బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనాలు వెళ్లడానికి అవకాశం లేదని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. కావున భారీ వాహనాలు జగిత్యాల నుండి జాబితాపూర్ గొల్లపల్లి మీదుగా రాజారంపల్లి, రాయపట్నం మీదుగా వెళ్ళవలసిందిగా, అదేవిధంగా టూ వీలర్స్, ఫోర్ విల్లర్స్ వాహనాలు ఈశ్రజ్ పల్లి, గంగాపూర్ మీదుగా వెళ్లడానికి అవకాశం ఉంది. కావున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని సురక్షితంగా వెళ్లాలని ఎస్పి సూచించారు.