వారు మోసగించారు వీరు ఆదరించారు

వారు మోసగించారు వీరు ఆదరించారు
  • బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి
  • కేకే ఆధ్వర్యంలో చేరిన అంజా గౌడ్ 

ముద్ర,ఎల్లారెడ్డిపేట : బీఆర్ఎస్ పార్టీ మోసగించారు కాంగ్రెస్ పార్టీ ఆదరించారు అని గులాబీని వీడి  హస్తం పార్టీలో చేరికయ్యానని గంట అంజా గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేటకు చెందిన గంట అంజాగౌడ్, బింగి మల్లేశం లు శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికయ్యారు. అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన అంజా గౌడ్  మొన్న జరిగిన సేస్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు. అదేవిధంగా తన సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని స్వతంత్ర అభ్యర్థిగా  నామినేషన్ కూడా దాఖలు చేయగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య రంగంలోకి దిగి అంజయ్యను బుజ్జగించి విత్ డ్రా చేయించాడు.కాగా బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం కల్పించాలని ఆగయ్య ను కోరగా సూత్రపయంగా అంగీకారం తెలిపి ఆ పదవి తనకు కేటాయించకుండా మరో సామాజిక వర్గానికి చెందిన బందారపు బాల్ రెడ్డికి ఇవ్వడంతో తీవ్రంగా అసహనానికి లోనై పార్టీ మారడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న పార్టీ అని తనకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని అంజా గౌడ్  ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పందిర్ల లింగం గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.