ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల ముద్ర: మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మునగాల మండల కేంద్రానికి చెందిన పెనుయేలు వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, మానసిక వికలాంగులకు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన  పెనుయేలు సంస్థ అధ్యక్షులు జె. సామ్యూల్ మాట్లాడుతూ, పెనుయేలు సంస్థ నిర్వహించే సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మానసిక వికలాంగులకు పండ్లు బ్రెడ్డు పంపిణీ చేసి అన్నదానం చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. సంపాదించిన సంపాదనలో కొంతమేరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎంతో మానసిక సంతృప్తినిస్తుందని, అలాగే ఇలాంటి ఆశ్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, దాతృత్వం గల దాతలు ఆశ్రమాలకు అవసరమైన వివిధ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుయేలు సంస్థ సెక్రటరీ ఎం రాజేష్, కోశాధికారి జె .ప్రవీణ్, వ్యవస్థాపకులు డాక్టర్ జె సుదర్శనం, ఉపాధ్యక్షులు జి ప్రభాకర్, సహాయ కార్యదర్శి జె ఉష, సభ్యులు ఎ.బిక్షం, ఇ.సైదులు, లూకా, సుధాకర్, వీణ, కరుణ, పద్మ, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.