కళ్లకు గంతలతో పంచాయతి కార్యదర్శుల నిరసన
![కళ్లకు గంతలతో పంచాయతి కార్యదర్శుల నిరసన](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_644f7bc7d1861.jpg)
ముద్ర ప్రతినిధి నిర్మల్: తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ జూనియర్ పంచాయతి కార్యదర్శులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట కొనసాగిస్తున్న వారి సమ్మెలో భాగంగా సోమవారం కార్యదర్శులు కళ్లకు గంతలు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత తమ సర్వీసులు క్రమబద్ధం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని తాము సమ్మె చేస్తున్నామన్నారు.తమ సర్వీసులను క్రమబద్ధం చేసేవరకు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.