యువతి అదృశ్యం
![యువతి అదృశ్యం](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63ef84441c6bf.jpg)
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరు నర్సాపురం గ్రామానికి చెందిన జనగం కళ్యాణి (19 ) అనే యువతి అదృశ్యం అయింది. ఇందుకు సంబందించి మంగపేట పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బోరు నర్సాపురం గ్రామానికి చెందిన జనగం క్రిష్ణ రెండవ కుమార్తె అయిన జనగం కళ్యాణి వరంగల్ లో డిగ్రీ ఫస్టియర్ చదువుతుంది. చదువు కొనసాగించడం ఇష్టం లేక గత నాలుగు నెలల నుండి వరంగల్ నుండి వచ్చేసి బోరు నర్సాపురంలో ఇంటి వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదిన ఉదయం 9 గంటలకు తనను వెదకవద్దు అని లెటర్ వ్రాసి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈ విషయంపై జనగం కళ్యాణి తండ్రి జనగం క్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.