వెల్గటూర్ లో  బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం..

వెల్గటూర్ లో  బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం..

వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ మేరకు గ్రామ శివారులో గల  పోచమ్మ తల్లి ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మరొకసారి ఎమ్మెల్యేగా గెలవాలని  నాయకులందరు కలిసి ప్రత్యేక పూజలు  చేశారు. అనంతరం గ్రామంలో గల అన్ని వార్డులల్లో పర్యటించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు రంగు తిరుపతి గౌడ్, ఎంపిటిసి పెద్దూరి హారిక భరత్, ప్యాక్స్ చైర్మన్ గోళి రత్నాకర్, మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చల్లురి రాంచెందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, నాయకులు గండ్ర విష్ణు వర్ధన్ రావు,  బండమీది ముత్తయ్య,  కొప్పుల సురేష్, బండ మీది గోపి, బందెల రాజయ్య, ఎర్రోళ్ల మహేష్, బందెల నర్సయ్య, మెరుగు అశోక్ గౌడ్, గాలిపల్లి మహేష్, మల్యాల కుమార్, మూగల భాను, ద్యావన పల్లి రాజయ్య, పెద్దూరి సంతోష్, బండ మీది మల్లిక, లావణ్య, ద్యావన పల్లి శ్రీనివాస్, ఎర్రోళ్ల రాంలాల్, పోనగంటి గంగయ్య, మంత్రి నరేష్, గౌరు అరవింద్, పచ్చనూరి యాదగిరి, మంత్రి రాజు, పోనగంటి అనిల్ తేజ, కొప్పుల ప్రవీణ్,కొండ సాయినాథ్,పందిరి వెంకటేష్, గుమ్ముల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.